నిడమనూరులో వైయస్ జగన్
16 Dec, 2016 10:43 IST
కృష్ణాః వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వైయస్ జగన్ నిడమనురు వెళ్లారు. కారు దగ్ధం ఘటనపై సర్పంచ్ కోటేశ్వరరావుతో వైయస్ జగన్ మాట్లాడారు. దగ్ధమైన కారును పరిశీలించారు.