నెల్లూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి 80వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన నెల్లూరు రూరల్ మండలం దేవరపాళెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ, పెనుబల్లి, సాల్మాన్పురం,ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డిపాలెం క్రాస్రోడ్డు వరకూ యాత్ర కొనసాగనుంది. అక్కడ ప్రజలతో ఆయన మమేకం అవుతారు. అనంతరం బుచ్చిరెడ్డిపాళెంలో బహిరంగసభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.