తూర్పు గోదావరి: వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం సాయంత్రానికి పిఠాపురం నియోజకవర్గం చేరుతుందని పార్టీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తెలిపారు. పెద్దాపురం మండలం దివిలి మీదుగా నియోజకవర్గంలోని పిఠాపురం మండలం విరవలో ప్రజా సంకల్పయాత్ర మొదలవుతుందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్లో బహిరంగ సభలో పార్టీ అధినేత మాట్లాడతారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గ ప్రజలు తరలిరావాలని వారు కోరారు. పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. తొలుత ప్రజా సంకల్పయాత్ర రూట్ మ్యాప్ను ఆ పార్టీ ప్రోగ్రాం కో ఆర్టినేటర్ తలశిల రఘురామ్ పరిశీలించారు. ఉప్పాడ సెంటర్ చేపట్టే బహిరంగ సభ ప్రదేశాన్ని, యాత్ర సాగే రూట్ను ఆయన పరిశీలించారు. పార్టీ నియోజకవర్గ పార్టీ కో ఆర్టినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావుతో కలిసి ఆయన బహిరంగ సభ, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొజ్జా రామయ్య, ఆనాల సుదర్శన్, కర్రి ప్రసాద్, బోను దేవా తదితరులు పాల్గొన్నారు.