నాగుల్లంక నుంచి 194వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

20 Jun, 2018 10:05 IST
తూర్పుగోదావ‌రి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం నాగుల్లంక శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చాకలిపాలెం, తాటిపాక మఠం మీదుగా పొదలాడ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.  విరామం అనంతరం పాదయాత్ర రాజోలు వరకు కొనసాగుతుంది. రాజోలులో జరిగే బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి  ప్రసంగిస్తారు.