అమలాపురం నుంచి 200వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

27 Jun, 2018 09:24 IST

 
తూర్పు గోదావ‌రి : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200వ రోజు మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా జననేత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభించి నేటికి రెండు వందల రోజుల మైలు రాయి చేరుకోవడం అమలాపురంలో పండుగ వాతావరణం ఏర్పడింది. పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష ప్రజానీకం మధ్య, జననేత తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కామనగరువు, అప్పన్నపేట, విలాసవిల్లిల, వాసంశెట్టివారి పాలెం మీదుగా భీమనపల్లి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అరాచక పాలనను ఎండగడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌  కడప జిల్లా ఇడుపులపాయ నుంచి గతేడాది నవంబర్‌ 6న వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. 200 రోజుల పాటు 2400 కిలోమీటర్లలకుపైగా పాదయాత్రను రాజన్న బిడ్డ పూర్తి చేసుకున్నారు. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్లను తుడుస్తూ, ఆత్మీయంగా స్పృశిస్తూ, పలకరిస్తూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.