హంద్రీనీవా ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఉరవకొండలో చేపట్టిన మహాధర్నాలో పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పాల్గొన్నారు. వేదిక వద్దకు చేరుకున్న వైయస్ జగన్ కు అనంత ప్రజానీకం ఘనస్వాగతం పలికింది. పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు పలికారు.