గుంటూరు : మాజీ ఉప ప్రధాని, సామాజిక నేత బాబూ జగజ్జీవన్రామ్కు వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ గురువారం ఉదయం గుంటూరు జిల్లా వేజేండ్ల శివారులో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో వైయస్ జగన్ పాల్గొని బాబూ జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైయస్ జగన్ ...దేశానికి బాబూ జగజ్జీవన్రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన చేసిన సేవల్ని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.