జనంతో వైఎస్ జగన్ బిజీబిజీగా

11 Feb, 2015 17:21 IST

పులివెందుల: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రజలతో బిజీబిజీగా గడిపారు. పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జగన్ పర్యటించే సమయంలో.. అభిమానులు జై జగన్..జై జై జగన్ అంటూ ఈలలు వేశారు. జగన్‌ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు జనం పోటీ పడ్డారు.