వైయస్ జగన్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

3 Aug, 2017 11:06 IST

నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి రానుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వైయస్ జగన్ రాకతో ప్రచారం హోరెత్తనుంది. కాగా, నేడు నంద్యాలలో జరిగే బహిరంగసభలో వైయస్ జగన్ పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ఆపార్టీని వీడి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరనున్నారు.