విశాఖ: కేరళ వరద బాధితులకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులకు తమ పార్టీ తరఫున రూ. కోటి విరాళం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోటి విరాళాన్ని కేరళ సీఎం సహాయ నిధికి పంపుతున్నట్లు వైయస్ఆర్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వరణుడి ప్రకోపానికి దేవభూమి కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను విచ్చిన్నం చేస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద నీటిలో మునిగిపోయిన ఊళ్ల పరిస్థితి ఇంకా దైన్యంగానే ఉంది. దీంతో ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే కనపడుతున్నాయి. వరద బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొన్ని చోట్లకు మాత్రం సరైన సమయంలో చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి..వైయస్ఆర్సీపీ తరఫున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.