కాసేపట్లో ధర్మవరానికి వైయస్ జగన్

17 Oct, 2017 11:17 IST

అనంతపురంః కాసేపట్లో వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ ధర్మవరం చేరుకోనున్నారు. ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ  37 రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్న చేనేతలకు తన సంఘీభావం తెలపనున్నారు.  చేనేతల ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపనున్నారు. మరోవైపు, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను వైయస్ జగన్ పరిశీలిస్తారు. అదేసమయంలో అనంతపురంనకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వైటీఆర్ శివారెడ్డి వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.