పాల్వాయి మృతికి వైయస్ జగన్ సంతాపం

9 Jun, 2017 11:25 IST

హైదరాబాద్ః కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతికి వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానూభూతి తెలిపారు. కాగా, పాల్వాయి కులుమనాలిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రస్తుతం పాల్వాయి గోవర్దన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.