పీవీ సింధుకు వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు

5 Aug, 2018 19:07 IST
తూర్పుగోదావరి: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆదివారం జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పీవీ సింధు ప్రత్యర్థి (స్పెయిన్‌) మారిన్‌పై పోరాడి ఓడింది.