హైదరాబాద్: సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది పావని పరమేశ్వరరావు(పీపీరావు) మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన పీపీరావు న్యాయవాదిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ కొనియాడారు. పలు జాతీయ, అంతర్జాతీయ కమిటీలు, వేదికల్లో భాగస్వామ్యులై నిర్వహించిన పాత్ర ఎనలేనిదని, పీపీరావు సేవలను స్మరించుకున్నారు. పీపీరావు కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.