వైయస్ జగన్ సంతాపం

12 Mar, 2017 13:07 IST

హైదరాబాద్ః  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, గుండెపోటుతో భూమా నాగిరెడ్డి  మృతి చెందారు. రేపు ఆళ్లగడ్డలో నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.