కొత్త రాజధాని నిర్మాణం జగన్కే సాధ్యం
కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవాలని చార్టర్డు అకౌంటెంట్లు నిర్ణయించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు సీనియర్ చార్టర్డు అకౌంటెంట్ వై ఈశ్వరప్రసాద్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త రాజధాని నిర్మాణం, సీమాంధ్ర పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు చర్చించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రీ ఆడిటింగ్ జరపాలనే ఒక వినూత్నమైన ప్రక్రియకు శ్రీ వైయస్ జగన్ శ్రీకారం చుడుతున్నందున ఈ విషయంలో చార్టర్డు అకౌంటెంట్లు నిధుల సక్రమ వినియోగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని సమావేశం అభిప్రాయపడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి.ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. పేదల హృదయాల్లో నిలిచిపోయేలా తన తండ్రి లాగానే తాను కూడా సంక్షేమ పథకాలు చేపట్టాలన్న కృతనిశ్చయంతో శ్రీ జగన్ ఉన్నారంటే ఆయన చిత్తశుద్ధి అర్థమవుతోందని చెప్పారు.