బ్రాండిక్స్ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి

4 May, 2016 15:19 IST

విశాఖపట్నంః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లా అచ్యుతాపురం చేరుకున్నారు. ఈసందర్భంగా అక్కడకు వచ్చిన జననేతకు కార్మికులు అపూర్వ స్వాగతం పలికారు. బ్రాండిక్స్ కార్మికుల ఉద్యమానికి వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు.  కార్మికుల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ సావధానంగా వింటున్నారు. కార్మికులతో ముఖాముఖి చర్చిస్తున్నారు.