విశాఖ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ విశాఖలో పర్యటించారు. మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మనమరాలు బిందు మౌనిక వివాహానికి విచ్చేశారు. నగరంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ హాల్లో బిందు మౌనిక వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు బిందు మౌనిక-గిరిధర్లను ఆశీర్వదించారు. అనంతరం వైఎస్ జగన్ సర్క్యూట్ హౌస్లో పార్టీ సమన్వయకర్తలతో సమావేశం అయ్యారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంతో పాటు, పలు అంశాలపై చర్చించారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలు దేరారు.