వైయస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చనేతల దాడి

30 Dec, 2016 19:04 IST

ఎమ్మిగనూరు(కర్నూలు): అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా శుక్రవారం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో తెలుగు తమ్ము‍ళ్లు రెచ్చిపోయారు. స్థానిక దుకాణాల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైయస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో, కార్యకర్తలకు గాయాలయ్యాయి.