జలంతరకోట వద్ద ముగిసిన యాత్ర
2 Aug, 2013 20:01 IST
పలాస 02 జూలై 2013
:దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం 228వ రోజు పాయాత్ర శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ముగిసింది. శుక్రవారం ఆమె 19.3 కి.మీ. నడిచారు. పలాస నియోజకవర్గంలో జాతీయ రహదారి మీదుగా ఆమె పాదయాత్ర సాగింది. జలంతరకోట వద్ద ఆమె యాత్ర ముగిసింది. ఉదయం నడక యాత్ర ప్రారంభించింది మొదలు ఆమె దారిలో ఎదురైన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సాగారు.