విజయమ్మకు గన్నవరంలో ఘన స్వాగతం

19 Aug, 2013 19:47 IST
గన్నవరం (కృష్ణాజిల్లా),

19 ఆగస్టు 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మకు గన్నవరంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర‌ విభజన విషయంలో సమన్యాయం పాటించాలంటూ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న శ్రీమతి విజయమ్మ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు.

‌శ్రీమతి విజయమ్మకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. గన్నవరం నుంచి శ్రీమతి విజయమ్మ గుంటూరుకు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్ళారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు అన్నివర్గాల నుంచి విశేషంగా మద్దతు లభిస్తోంది. ఆమె దీక్షకు మద్దతుగా వైయస్ఆర్ ‌కాంగ్రెస్ ‌నాయకులు పలు జిల్లాల్లో దీక్షలు చేపడుతున్నారు. అంతకు ముందు శ్రీమతి విజయమ్మ సోమవారం ఉదయం లోటస్ పాండ్ నుంచి బయల్దేరి విమానంలో ఉదయం 9.45 గంటలకు గన్నవరం చేరుకు‌న్నారు.