వెంకటేశ్వరరావు కుటుంబానికి మోపిదేవి పరామర్శ
30 Aug, 2017 21:06 IST
మైనేనివారిపాలెం(రేపల్లెరూరల్, గుంటూరు): మండలంలోని మైనేనివారిపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యూరు వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందటంతో బుధవారం ఆయన కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పరామర్శించారు. వెంకటేశ్వరరావు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు కుమారులు రామకృష్ణ, వెంకట నాగేశ్వరరావులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.