కాంట్రాక్ట్ ఉద్యోగుల గొంతు కోశాడు

19 Apr, 2017 13:24 IST
హైదరాబాద్ః కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ఎన్నికల్లో ఊదొరగొట్టిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచి గొంతు కోశాడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో కరువు, నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని ఆరోపించారు. బాబు తన మూడేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగమివ్వకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు.