ప్రారంభమైన వంచనపై గర్జన దీక్ష

2 Jul, 2018 10:02 IST

అనంతపురం: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అములులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని నిరసిస్తూ అనంతపురంలో వైయస్ ఆర్ కాంగ్రెస్  పార్టీ ఆద్వర్యంలో వంచన పై గర్జన దీక్ష కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. పార్టీకి చెందిన తాజా మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ముఖ్యనేతలందరూ నల్లటి దుస్తులతో దీక్షకు హాజరయ్యారు. సభా స్థలిలో వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు దీక్షను ప్రారంబించారు. సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్ష కొనసాగనుంది