విజయనగరం: వాల్మీకి మహర్షి చిత్రపటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సంకల్ప యాత్ర 293వ రోజు ప్రారంభానికి ముందు శిబిరంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే రాజన్న దొర, సీనియర్ నాయకులు భుమన కరుణాకర్రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.