'వైయస్'పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
13 Apr, 2013 18:53 IST
అనంతపురం, 13 ఏప్రిల్ 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సోనియా గాంధీలను ప్రసన్నం చేసుకునేందుకే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్ఆర్ కుటుంబంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శవాలపై డబ్బులు ఏరుకునే రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు.