వైయస్ఆర్ కాంగ్రెస్లోకి వసంత నాగేశ్వరరావు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేటలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన పార్టీలో చేరారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డాక్టర్ వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వసంత నాగేశ్వరరావుకు ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. డాక్టర్ వైయస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇంటిదగ్గర కూర్చున్న తనను ఎవరూ పట్టించుకోని రోజుల్లో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గుర్తింపునిచ్చి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా, నాప్కాబ్ ఉపాధ్యక్షుడిగా నియమించారని గుర్తు చేసుకున్నారు. ఆయన రుణం తీర్చుకునేందుకు పార్టీలో చేరి సామాన్య కార్యకర్తగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.