వైయస్ఆర్ సీపీలోకి ప్రవీణ్కుమార్రెడ్డి
16 Dec, 2012 17:31 IST
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు నాశనం చేశారన్నారు. గత 30 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేసిన తమను బయటికి వెళ్లగొట్టారని ఆరోపించారు. భారతదేశంలో ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేయాలని తన నియోజకవర్గ ప్రజలను కోరారు.