అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఓ దశలో విశ్వేశ్వరరెడ్డి తహశీల్దార్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇళ్ల పట్టాల పంపిణీలో పయ్యావుల కేశవ్ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు.