వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
29 Mar, 2017 10:56 IST
హైదరాబాద్ : హేవిళంబి తెలుగునామ సంవత్సరం సందర్భంగా బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి, నాయకులు కొండా రాఘవరెడ్డి, తదితరులు హాజరయ్యారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు.