వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
7 Apr, 2016 22:48 IST
హైదరాబాద్) తెలుగు వారి తొలి పండుగ ఉగాదిని సంప్రదాయబద్దంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఉదయం 10.30ని. లకు ఏర్పాటయ్యాయి. ప్రముఖ పండితులు మారేపల్లి రామచంద్ర శాస్త్రి పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్, పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ, ఇతర నాయకులు ఇందులో పాల్గొంటున్నారు.