విజయసాయిరెడ్డికి టీడీ నోటీసులు

13 Jun, 2018 12:36 IST
తిరుపతి: వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీపై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పోస్టు ద్వారా విజయసాయిరెడ్డికి నోటీసులు పంపించారు. టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేసిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.