రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం

15 Jun, 2016 15:41 IST

తిరుపతి: రైల్వే సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ..ఇప్ప టికే నగరంలోని అనేక సమస్యలు పరిష్కరించామన్నారు. తిరుపతి నుంచి షిర్డీకి ప్రత్యేక రైలు వేయించినట్లు వరప్రసాద్ చెప్పారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నడికుడి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామన్నారు.