పొట్టిశ్రీరాములకు ఘన నివాళి
16 Mar, 2017 16:51 IST
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పార్టీ నాయకులు వాసిరెడ్డి పద్మ, పుత్తాప్రతాప్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ..తెలుగు వారి కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన్ను బావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు.