రేపు రైతు సదస్సు
2 Dec, 2017 18:32 IST
కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గం, తుగ్గలి మండలం ఎర్రగుడి గ్రామంలో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. రైతులతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకుంటారు. అలాగే రైతు సంఘాల నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.