నేడు రాష్ట్ర వ్యాప్తంగా జలదీక్షలు
17 May, 2016 09:46 IST
తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల కట్టడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జలదీక్షలను నిర్వహిస్తున్నారు. అన్ని మండల కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మొద్దనిద్ర వీడి ఆ ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేయనున్నారు. కాగా జలదీక్షలను విజయవంతం చేయాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
To read this article in English: http://bit.ly/1OzcOtx