తిరుపతికి చిరంజీవి మొండిచెయ్యి!

8 Nov, 2012 21:26 IST
తిరుపతి

8 నవంబర్ 2012 : తన ఎంపీ లాడ్స్‌ నిధులను ఇతర జిల్లాలకు మళ్లించి చిరంజీవి తిరుపతికి మొండిచేయి చూపారని వైయస్ఆర్ సీపీ ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తిరుపతి వాసులను చిరంజీవి నమ్మించి మోసం చేశారన్నారు. తిరుపతిని దత్తత తీసుకుంటానని చెప్పిన చిరంజీవి తన హామీలను విస్మరించారన్నారు. తిరుపతిలో డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి విషజ్వరాలు వ్యాపిస్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భూమన మండిపడ్డారు.