తెలుగు సాంప్రదాయాలను కాపాడుకుందాం
2 Feb, 2017 20:13 IST
ఖాజీపేట: ఇంగ్లీసు మీడియం మోజులో పడి కన్నతల్లి లాంటి తెలుగు భాషను మరువద్దని, తెలుగు సాంప్రదాయాలను కాపాడుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది దస్తగిరిబాబు విద్యార్థులకు సూచించారు. సమరసత సేవాసమితి ఆధ్వర్యంలో వేదాస్పాఠశాలలో సరస్వతీ దేవి పూజాకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషలో చదవడం వ్రాయడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలిని అన్నారు. మమ్మిడాడి సంసృతిని వదలాలని సూచించారు.