రాజ్యాంగం అపహాస్యం

26 Sep, 2017 13:34 IST

హైదరాబాద్ః చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని వైయస్సార్సీపీ నేత తెల్లం బాలరాజు మండిపడ్డారు.  ఎమ్మెల్యేలు కాని వారిని 8మందిని గిరిజన సలహా కమిటీలో నియమించడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనన్నారు.  దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తుకు వస్తారని, ఆతర్వాత ఆయనకు కనబడని అన్నారు. గిరిజనులను చంద్రబాబు ఎలా దగా చేస్తున్నాడో ప్రజలు గమనించాలన్నారు.