హైదరాబాద్ః ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్రెడ్డి తెలుగు రాష్ట్రాల టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి గురువులు అందించే సేవలను ఆయన కొనియాడారు. భావి భారత పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయక పాత్ర పోషిస్తారని అన్నారు. వారి సేవలు మరువలేనివన్నారు