టీడీపీవి నీచ రాజకీయాలు
13 Feb, 2017 18:53 IST
వలేటివారిపాలెం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను మహిళా సదస్సుకు పిలిచి ప్రభుత్వమే అవమానపరచడం సిగ్గుచేటని పార్టీ జిల్లా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇరపని అంజయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా సాధికారత సమావేశానికి ఆహ్వానించి అవమాన పర్చిన టీడీపీ ప్రభుత్వానికి మహిళలే బుద్ది చెప్పాలన్నారు.నీతి మాలిన రాజకీయాలు చేస్తు రాష్ట్రాన్ని అబివృద్ది పథంలో నడిపిస్తున్నట్లు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకోవడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రోజాను అవమాన పరిచిన నాయకులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.