వైయస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం
21 Mar, 2017 10:35 IST
- మీడియా పాయింట్ వద్ద అధికార పార్టీ అహంకారం
- వైయస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి యత్నం
ఏపీ అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో, బయట అధికార పార్టీ రౌడీయిజానికి దిగింది. శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కడమే గాకుండా... మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి యత్నించారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతుండగా అధికార పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. మీడియా లోగోలను లాగేందుకు ప్రయత్నించారు.