టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
కర్నూలు: వెలుగోడు మండల పరిధిలోని మోతుకూరు గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన 2వ వార్డు మెంబర్ ఎ్రరవాండ్ల నారాయణ, టీడీపీ సీనియర్ నాయకుడు బాలస్వామి, బాలనాయుడు, పోతం వెంకటసుబ్బారెడ్డి, గంగన్నగారి బాలుగ్రం, సీ. నాగేశ్వరరావు, చక్రి, బోయ జనార్థన్, బోయ మురళి, విజయ, చిన్న హుశ్సెనీ, నూరుబాషా తదితరులు బుడ్డా శేషారెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ముంతల విజయభాస్కర్రెడ్డి, అంబాల ప్రభాకర్రెడ్డి, ఇలియాస్ఖాన్, మద్దెల వెంకట్రామిరెడ్డి, బోగోలు శివశంకర్నాయుడు, బోగోలు సుదర్శన్, బోగోలు బాలసుబ్బయ్య, రామలింగారెడ్డి, ప్రతాప్రెడ్డి, పోతురాజు ప్రకాశం, పుల్లంరాజు, పోసి వరమయ్య, సుధాకర్, దేశసహాయం తదితరులు పాల్గొన్నారు.