వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నేతలు చేరికలు..

4 Sep, 2018 11:58 IST
విశాఖ జిల్లాః జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమర్థత, నాయకత్వ పటిమ పట్ల నమ్మకంతో రోజురోజుకు వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. భారీసంఖ్యల్లో ఇతర పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. దాలివలస టీడీపీ సర్పంచ్‌ ఆదిరెడ్డి రామానాయుడు పాటుగా పలువురు టీడీపీ నేతలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారికి వైయస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.