విశాఖ జిల్లాః వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై వైయస్ఆర్సీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు భారీసంఖ్యలో వలసబాట పడుతున్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు మాడుగల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి చేరారు.టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనే మాటే లేదని, వైయస్ జగన్ను గెలిపిస్తే మళ్లీ వైయస్ రాజశేఖర్రెడ్డి పాలన రాబోతుందన్నారు. జగన్ వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.