వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత

17 Oct, 2017 14:32 IST

అనంతపురంః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద వైయస్ జగన్ కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. హిందూపురం మాజీ జడ్పీటీసీ రాజారెడ్డి సహా 100 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.