టీడీపీ నేతల ఓవరాక్షన్
9 May, 2018 14:38 IST
విజయవాడ: మైలవరం పీఏసీఎస్ బ్యాంకు ప్రారంభోత్సవంలో అధికార తెలుగు దేశం పార్టీ నేతలు ఓవరాక్ష న్ చేశారు. వైయస్ఆర్సీపీ నేతలపై ఎంపీ కేశినేని నాని నోరు పారేసుకున్నారు. దీంతో నాని ప్రసంగాన్ని వైయస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. ఇది రాజకీయాలు మాట్లాడుకోవడానికి వేదిక కాదని హితవు పలికారు. అయినా టీడీపీ నేతలు రెచ్చిపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతే టీడీపీ నేతలు రాజకీయాలు మాట్లాడటం దారుణమన్నారు.