టీడీపీ, కాంగ్రెస్ నుండి వైయస్సార్సీపీలో చేరిక
27 May, 2017 18:17 IST
గుడిబండ: మండల పరిధిలోని సీసీ గిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్నాయకుడు బీ యంజారప్ప తన అనుచరులతో కలిసి తాలూకా సమన్వయకర్త డాక్టర్తిప్పేస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా ఎస్ఆర్హట్టి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గోవిందప్ప కూడా వైయస్సార్సీపీలో చేరారు. వీరికి సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.