– పోలీసుల అండదండలతో చెలరేగుతున్న దొంగలు
– అడ్డంగా దొరికిపోయిన ఎస్పీకి పదోన్నతా..?
– డ్వాక్రా మహిళల ఖాతాలో రూ. లక్ష జమ చేసేదెప్పుడు
– వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి
తిరుపతి: ఎ్రరచందనం అక్రమ రవాణాను అరికట్టి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. లక్షన్నర జమ చేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు మాటలకు చేసే పనులకు తీవ్ర వ్యత్యాసం ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ సహకారంతోనే ఎ్రరచందనం అక్రమ రవాణా జరుగుతుందని ధ్వజమెత్తారు. మంగళవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన∙విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎ్రర చందనం స్మగ్లర్లకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తూ సరఫరాకు సహకరిస్తుందని ఆరోపించారు. డ్వాక్రా మహిళల అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తానన్న చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎ్రరచందనం స్మగ్లింగ్ను ఉక్కుపాదంతో అణచివేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం స్మగ్లర్ల కోసమే పనిచేస్తుందని పేర్కొన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో 11 లక్షల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎ్రర చందనం విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని ప్రభుత్వమే చెప్పిన మాట నిజం కాదా అని భూమన ప్రశ్నించారు. శేషాచలం అడవుల్లోకి ప్రభుత్వం ఇప్పుడు పాత్రికేయులను వెంటబెట్టుకుని వెళ్లిన కనీసం 5వేల మంది కూలీలు చెట్లను నరుకుతూ కనిపిస్తారని ఆయన సవాల్ విసిరారు.