ప్రశ్నోత్తరాల సమయంలో ప్రసంగాలు
16 Mar, 2017 09:47 IST
ఏపీ అసెంబ్లీ: చట్టసభ సాక్షిగా అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘించింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని అభినందన సభగా మార్చారు. పోలవరం ఘనత చంద్రబాబుదే అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ విషయంపై మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరినా స్పీకర్ పట్టించుకోవడం లేదు. టీడీపీ సభ్యులు, బీజేపీ సభ్యులు మాట్లాడిన తరువాత వైయస్ జగన్కు కేవలం 3 నిమిషాల సమయం కేటాయించారు. ఆ తరువాత మైక్ కట్ చేసి మంత్రి దేవినేని ఉమాకు అవకాశం ఇవ్వడంతో యధావిధంగా ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగారు.